తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ– 2025"ని కొత్తగూడెం లోని శ్రీ చైతన్య స్కూల్ కైవసం చేసుకుంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సమీపంలోని హేమచంద్రపురంలో గల భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (BKCA) మైదానంలో అండర్ 14 జట్లకు మధ్య జరిగిన రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్స్ ఘనంగా ముగిసింది. ఈ ట్రోఫీ ప్రధానానికి ముఖ్యఅతిథిగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండపర్తి నరేష్ కుమార్ హాజరయ్యారు. ఫైనల్స్ మ్యాచ్లో శ్రీ శారద విద్యాలయ స్కూల్ జట్టుపై నిర్ణీత 20 ఓవర్లలో 103 పరుగుల లక్ష్యాన్ని శ్రీ చైతన్య స్కూల్ జట్టు చేదించి విజేతలుగా నిలిచారు. విన్నర్స్, రన్నర్స్ జట్లకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలపై బలమైన సంకల్పంతో మక్కువ పెంచుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు రాణించగలరని అన్నారు. ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ వరకు చేరుకొని విన్నర్స్, రన్నర్స్ గా నిలిచిన జట్లను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్ కన్వీనర్లుగా మతిన్ (ఖమ్మం), పంతంగి సాయి నిరంజన్ (భద్రాద్రి కొత్తగూడెం), ఆర్గనైజర్లుగా బోయిని ప్రసాద్, మార్గం నరేందర్, పదిరి నర్సిరెడ్డి వ్యవహరించారు. ఈ ఫైనల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు క్రీడాకారులు, తల్లిదండ్రులు, పాఠశాల పీఈటీలు, యాజమాన్యాలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ