తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జనసేన రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాసరావు సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం లో జనసేనకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. జనసేన రాష్ట్ర నాయకులు రాము యాదవ్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ, కొత్తగూడెం పట్టణ నాయకులు శ్యామ్, నియోజకవర్గ నాయకులు నరేష్, జనసేన వీర మహిళ జై శ్రీ, దివ్య, విగ్నేశ్వరి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ