తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ఉదయం నగర మేయర్ మూడ్ గణేష్ కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగూడెం డివిజన్ అటెండెన్స్ పాయింట్ ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు విధిగా హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, పారిశుధ్యం పై డివిజన్లలో వస్తున్నా పిర్యాదులు ఎప్పటికప్పుడు పరిస్కారం అయ్యేలా చూసుకోవాలని, సంబందించిన జవాన్లు పని వేళల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లతో మరియు నగర ప్రజలతో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిస్కారం చేసే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమం విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, జవాన్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ