Monday, 03 August 2026 09:34:41 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహాసభల విజయవంతానికి పల్లెల్లో విస్తృత ప్రచారం

Date : 14 July 2026 05:25 PM Views : 78

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన సమస్యల పరిష్కారానికే రాష్ట్ర మహాసభలు 18న పాల్వంచలో జరిగే ప్రదర్శనకు భారీగా తరలిరావాలి: టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) మూడో రాష్ట్ర మహాసభల విజయవంతానికి ఏజెన్సీ పల్లెల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని బంగారు చెలక. బొజ్జలగూడెం, పాత బంగారుచెలక, పడగాయిగూడెం, లక్ష్మీపురం, చింతకుంట తదితర గిరిజన గ్రామాల్లో మంగళవారం సమాఖ్య నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి మహాసభల ప్రాధాన్యతను వివరించడంతో పాటు ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీల్లో పాల్వంచ పట్టణంలో జరగనున్న రాష్ట్ర మహాసభలు గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు, హక్కుల సాధనకు వేదిక కానున్నాయని స్పష్టం చేశారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ-గిరిజన సమాఖ్య జాతీయ నాయకులు డి అన్నిరాజా, పసుపతి కోల్, రాష్ట్ర నాయకులు అంజయ్య నాయక్, రామ్మూర్తి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఈ ఏజెన్సీ పోరాట మహాసభలను గిరిజనులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో వెంకట్, దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్, జర్పుల ఉపేందర్, కుంజా రాంబాబు, తాటి లక్ష్మణ్, పరుపర్తి రాజు, జోగా రామయ్య, ఇమామహేశ్వరి, బదియా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :