Sunday, 02 August 2026 08:02:28 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ మాత్రమే – పీవీకే-5 గని పిట్ కమిటీ

Date : 16 June 2026 02:04 PM Views : 57

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ ఎన్ టీ యు సి నాయకుల పోరాటం యాజమాన్యంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా, లేక కార్మిక సంఘాలపైనా, ఐఎన్‌టీయూసీ వైఖరి స్పష్టం చేయాలి. ఐ ఎన్ టీ యు సి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలపై పోరాడండి, కార్మిక సంఘాలపై కాదు, ఐఎన్‌టీయూసీకి ఏఐటీయూసీ హితవు డిపెండెంట్ ఉద్యోగాలు, సర్ఫేస్ పోస్టులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రూ.56 వేల కోట్ల బకాయిలపై ఐఎన్‌టీయూసీ నాయకులు సమాధానం చెప్పాలి – ఏఐటీయూసీ డిమాండ్. మంగళవారం ఉదయం పివికే5 గని లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఐటియుసి నాయకులు మాట్లాడుతూ అండర్‌గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని,కార్మికులను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలను ఇతర యూనియన్లు చేపట్టడాన్ని పీవీకే-5 గని పిట్ కమిటీ తీవ్రంగా ఖండించారు, పీవీకే-5 గనిలో జరిగిన ఐ ఎన్ టీ యు సి గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ యూనియన్‌ పై చేసిన విమర్శలను పిట్ కమిటీ ఖండించారు, ఐ ఎన్ టీ యు సి నాయకులు ఇకనుంచి పోరాటాలకు దిగుతామని చెప్పడం మంచిదే కానీ, అయితే ఆ పోరాటాలు ఐ ఎన్ టీ యు సి కి అనుబంధంగా ఉన్న ప్రభుత్వం పైన చేస్తారా,యాజమాన్యం పైన చేస్తారా, లేక ఇతర కార్మిక సంఘాల పైన చేస్తారా అనే విషయాన్ని ఐ ఎన్ టీ యు సి నాయకులు కార్మికులకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా డిపెండెంట్ లకు నియామక పత్రాలు ఇప్పించడం లో ఐ ఎన్ టీ యు సి పాత్ర ఏమిటో చెప్పాలని, డిపెండెంట్ వారసుల నియామకాల కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేసిన విషయం కార్మికులకు, డిపెండెంట్‌ లకు తెలుసని అన్నారు,అలాగే ఐ ఎన్ టీ యు సి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56వేల కోట్ల బకాయిల విషయంలో ఐ ఎన్ టీ యు సి నాయకులు తన వైఖరిని వెల్లడించాలని, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి "మెడికల్ బోర్డును మేమే ఆపాము" అని చేసిన వ్యాఖ్యలపై కూడా ఐ ఎన్ టీ యు సి నాయకులు అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా పీవీకే5 గనిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత ఇంటి పథకం విషయంలో "రెవెన్యూ మంత్రిగా నేనే సంతకం చేసి ఇస్తాను" అని ఇచ్చిన హామీ అమలుపై ఐ ఎన్ టీ యు సి నాయకులు మంత్రిని ప్రశ్నించాలని డిమాండ్ కోరారు, అదేవిధంగా టి బి జి కే ఎస్, బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్న 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అంశంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు,మణుగూరులో సర్ఫేస్ పోస్టులు తమ వల్లే వచ్చాయని చెప్పుకుంటున్న ఐ ఎన్ టీ యు నాయకులు, కొత్తగూడెం ప్రాంతంలో మాత్రం సర్ఫేస్ పోస్టులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారో కార్మికులకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు, ఐఈడి ప్రకారం కొత్తగూడెం భూగర్భ గాని కార్మికులకు 270 సర్ఫేస్ పోస్టులు ఇప్పించి భూగర్భ గని కార్మికులకు న్యాయం చేస్తే, ఐ ఎన్ టీ యు సి నిర్వహించే పాలాభిషేక కార్యక్రమంలో ఏఐటీయూసీ కండువాలతో పాల్గొని పాలాభిషేకం చేస్తామని తెలిపారు, ఏఐటీయూసీతో ఎలాంటి సంబంధాలు వద్దని ఐ ఎన్ టీ యు నాయకులు చెప్పడం హాస్యాస్పదమని, అది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేదా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా అనేది స్పష్టం చేయాలని కోరారు., ఐ ఎన్ టీ యు సి నాయకులు చేసే పోరాటాలు కార్మిక సమస్యల పరిష్కారానికి దోహదపడేలా ఉండాలని, ఇతర కార్మిక సంఘాలపై విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదని తెలిపారు,ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి భూక్య రమేష్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్ సెత్, పిట్ ఉపాధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, ప్రశాంత్, హరికృష్ణ, ఈర్ప కృష్ణ, సురేష్, రవీందర్, రాజేష్, కోటేశ్వరరావు, మహేష్, రామారావు, కార మోహన్, మదనయ్య, ముబారక్, మేకల శీను, మహేష్, సంతానం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :