తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ అండ్ పీఎం) కిరణ్ కుమార్కు మరియు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు.కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తిచేసిన ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య.సింగరేణిలో నూతన బాధ్యతలు స్వీకరించిన జిఎం(పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు జిఎం(పర్సనల్ ఐ ఆర్ అండ్ పిఎం)కిరణ్ కుమార్ ను ఎఐటీయూసీ నాయకులు శనివారం సాయంత్రం సింగరేణి ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం లో జీఎం కిరణ్ కుమార్, అజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ, కార్మికుల సంక్షేమం, పారిశ్రామిక సామరస్య పరిరక్షణలో ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మిర్యాల రంగయ్య మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని పేర్కొన్నారు.యాజమాన్యం–కార్మికుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ,కార్మికులకు సంబంధించిన ప్రతి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల క్యాడర్ స్కీమ్ లు, ప్రమోషన్లు,ఉద్యోగ సంబంధిత పరిపాలనా అంశాలు, సంక్షేమ సమస్యలు, ఆధారిత కుటుంబాల సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు,గతంలో ఏవిదంగా మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల వరసలను వారి కుటుంబాలను ఆదుకోవాలని.అదేవిధంగా గడిచిన ఏడాది లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించాలని,కొత్తగూడెం రీజియన్ లో అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ కన్వర్షన్ సమస్యను పరిష్కరించి అండర్ గ్రౌండ్ కార్మికులతో సర్ఫస్ ఖాళీలను భర్తీ చేసి వారికి న్యాయంచేయాలని కోరారు మరియు కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకుంటే యాజమాన్యంపై కార్మికుల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు.కార్మికులకు న్యాయం జరిగే విధంగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి సామల రాము, పిట్ కార్యదర్శులు అనంతలక్మి, నరేష్,నితిన్,కమల్, మధు కృష్ణ నాయకులు,హుమాయూన్,మల్లికార్జున్, నాగయ్య,శ్యాం, ఉషా,రజిత,సౌమ్య,రామకృష్ణ,సుష్మ,కృష్ణ,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ