తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం నాడు అర్దరాత్రి 2గంటల సమయంలో పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ నందు పాల్వంచ సీఐ సతీష్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా అదే ప్రాంతంలో ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన 09 మంది దుండగులను పట్టుకోవడం జరిగింది.కత్తులు,మాస్కులు మరియు ఇనుప రాడ్లతో రెండు కార్లతో తిరుగుతూ పట్టుబడిన 09 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిన పాల్వంచ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఈ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందిచడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో భాద్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తూ,వారి రక్షణ కొరకు పాటుపడే అధికారులు,సిబ్బందికి ఎప్పటికైనా మంచి పేరు లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీఐ సతీష్,ఎస్సై సుమన్ మరియు కానిస్టేబుళ్ళు హుస్సేన్,అబ్బురాములు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ