Thursday, 17 September 2026 10:40:55 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యం. బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 June 2025 08:00 PM Views : 906

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలను పొందేలా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి. ఓ.సి, కార్యాలయం లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 6 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య , ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి అందరికీ తెలియజేసి, వారందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 6 నుండి 14 సం. వయసు కలిగిన బడిఈడు పిల్లలందరిని గుర్తించి, సమీపంలోని బడికి వెళ్లేలాగా ప్రోత్సహించాలన్నారు.మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో, మహిళా సమాఖ్యల ద్వారా, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, అర్హత కలిగిన తరగతుల్లో తిరిగి చేర్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు ఎవరైతే పిల్లలను పంపించడానికి ఇష్టపడటం లేదో దానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయులు గ్రామాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు అందించే నాణ్యమైన విద్య గురించి వారికి అవగాహన కల్పించి తల్లిదండ్రుల యొక్క డబ్బు వృధా కాకుండా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా రానున్న రెండు వారాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి వాటికి తగిన మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విద్యా సంవత్సరం పూర్తయ్య నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేసి అన్ని పాఠశాలలకు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు మరియు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉల్లాసం యాప్ ద్వారా 15 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు వారిలో నిరక్షరాశులను గుర్తించి వారికి అభ్యాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 100% అక్షరాస్యత సాధించే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ పై అవగాహనలో భాగంగా, పాఠశాలల్లోని ఎకో క్లబ్స్ ఆధ్వర్యంలో, సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాలు ఎక్కువగా సేకరించిన పాఠశాలలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో 100% ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో తులసి,చింత, ఉసిరి, వెలగ, మునగ మరియు కరివేపాకు చెట్లు విస్తృతంగా నాటాలన్నారు. జిల్లావ్యాప్తంగా అజోల్ల, బయోచార్, కంపోస్ట్ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఫామ్ పౌండ్స్ నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమన్వయ సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు పి. పి.టి లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్,జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :