Thursday, 02 July 2026 06:58:42 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

Date : 05 May 2025 08:50 PM Views : 587

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.... జూలూరుపాడు మండలం కాకర్ల రెవెన్యూ గ్రామంలో నివాసం ఉంటున్న వంగవీటి ప్రేమ కన్యాకుమారి సర్వేనెంబర్ 115/ఓ 1 లో ఎకరం ఆరుకుంటల భూమి కి డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నానని, సదరు భూమిపై అన్ని హక్కులు ఉన్నప్పటికీ పూణెం సూరయ్య s/o ముత్తయ్య అను వ్యక్తి తన అనుచరులతో మా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా 2021 అవసరంలో పోలీసుల రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించగా భద్రాచలం మొబైల్ కోర్టు మరియు హైకోర్టు వారు తమకు అనుకూలంగా తరువులు జారీ చేసినప్పటికీ సదరు వ్యక్తి తన అనుచరులతో వ్యవసాయ పనులు చేస్తున్న మనుమడు చెక్కి లాల సందీప్ మరియు కూలీలను కర్రలతో కొట్టి దౌర్జన్యంగా బయటకు వెళ్లగొట్టారని కావున సదరు వ్యక్తిపై చట్టపర్తి చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవో మధుకు ఎండార్స్ చేశారు. సుజాతనగర్ మండలం సర్వారం, కోయగూడెంలో నివాసం ఉంటున్న జరుపుల లక్ష్మణ్ s/o దేర్లా కు లక్ష్మీదేవి పల్లి మండలం కారుకొండ పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల 2006వ సంవత్సరంలో ప్రభుత్వం వారు దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్ట్ కొరకు పెద్ద సైజు కాలువ తన పొలం గుండా త్రవ్వేరని దానికి దాదాపు నాలుగు ఎకరాల భూమి కోల్పోయానని, కానీ కాలువలో నీళ్లు రానందున కాలువ పూడ్చాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు మరియు మట్టి అవసరం ఉన్నందున ప్రభుత్వం వారు నా భూమిలో ఉన్న కాలువను పూడ్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం సుజాతనగర్ తాసిల్దార్ కు ఎండార్స్ చేయడం జరిగింది. ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న రైతులు తాము వ్యవసాయం వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా వ్యవసాయ భూముల్లో బోర్ వేసుకున్నాం కానీ విద్యుత్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, కావున ఆర్థికంగా వెనకబడినటువంటి గిరిజనులు వ్యవసాయం చేయుటకు ఉచిత విద్యుత్ మంజూరు చేయించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం విద్యుత్ శాఖ ఈ ఈ కి ఎండార్స్ చేయడం జరిగింది. పాత పాల్వంచ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్న ఎండి షాకిర బేగం తాను ఒంటరి మహిళలని ఎటువంటి ఆధారం లేని తాను ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నానని, తనకి అన్ని అర్హతలు ఉన్నాయని కావున మైనార్టీ శాఖ ద్వారా రాజీవ్ యువ వికాసం రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేయడం జరిగింది. పినపాక మండలం ఎల్లాపురం గ్రామం లో నివాసం ఉంటున్న చర్ప చిన్న లక్ష్మి w/o మల్లయ్య తమకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాగలిగిన 4 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నదని, భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇట్టి భూమి పై తెలంగాణ ప్రభుత్వం వారు ఇస్తున్న రైతుబంధు, రైతు రుణమాఫీ తమకు ఇప్పటివరకు మంజూరు అవలేదని కావున తమకు రైతుబంధు మరియు రైతు రుణమాఫీ మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేయడం జరిగింది. భద్రాచలం, సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న గండేపల్లి రామకృష్ణ s/o చక్రం గత 20 సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని, వికలాంగుడు అయిన తను ఇటువంటి పని చేయలేకపోతున్నాను అని కావున తనకు దివ్యాంగుల కోటాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పిడి హౌసింగ్ కు ఎండార్స్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :