తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చత్తీస్గడ్ రాష్ట్రంలో గత నెల 28న ప్రారంభమైన ఖేలో ఇండియా ట్రైబల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా క్రీడాకారుడు ఏ వెంకటప్రసాద పలు విభాగాలలో సత్తా చాటి రెండు రౌండ్లు క్రీడాకారులపై ఆధిపత్యం సాధించి గెలుపొందగా క్వార్టర్ ఫైనల్ రౌండ్ పోటీలో తలపడుతుండగా కాలి మణికట్టు వద్ద ప్యాక్చర్ అవడంతో చతిస్గడ్ రాష్ట్రం రాయపూర్ లో శస్త్ర చికిత్స పూర్తిచేసుకుని చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగ సీతారాములు వెంకటప్రసాదను తన ఇంటికి వెళ్లి పరామర్శించారు.వెంకట ప్రసాద్ ఇటీవల కాలంలో అనేక జాతీయ స్థాయిలో జరిగిన యూనివర్సిటీస్ రెజ్లింగ్, ఫెడరేషన్ కప్, జాతీయ సాయి సీనియర్స్, పలు రెజ్లింగ్ పోటీలలో సత్తా చాటి అనేక పతకాలు బహుమతులు గెలుపొందడం ద్వారా జాతీయస్థాయిలో జిల్లా కీర్తిని చాటిన వెంకట ప్రసాద్ త్వరగా కోలుకుని మళ్లీ రెజ్లింగ్ పోటీలలో పాల్గొని సత్తా చాటి పతకాలు సాధించడం ద్వారా జిల్లా కు పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని నాగ సీతారాములు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, కోచ్ లో సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ