Sunday, 02 August 2026 01:02:35 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పూర్తయిన ఇందిరమ్మ గృహాలకు వెంటనే బిల్లులు ఇవ్వాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 17 June 2026 06:40 PM Views : 201

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఉమ్మడి కుటుంబాల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి జీవనోపాధి వాహనం ఉందనే నెపంతో దరఖాస్తులు తిరస్కరించొద్దు ఇళ్లు ప్రారంభించని వారి నుండి 'నాట్ విల్లింగ్' పత్రాలు తీసుకోవాలి మొదటి విడతలోని మిగిలిన 199 మందికి ఇళ్లు మంజూరు చేయాలి అధికారుల సమీక్షాసమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉమ్మడి కుటుంబాల పెండింగ్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల, నిర్మాణం పూర్తిచేసుకున్న ఇండ్ల లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు తక్షణమే క్లియర్ చేసి పేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖా అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని లబ్ధిదారుల పేమెంట్లను సాంకేతిక కారణాలతో నిలిపివేయడం సరికాదన్నారు. గతంలో ఇల్లు ఉండి ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరిన వారిని కూడా ఆదుకోవాలని, 600 చదరపు అడుగుల నిబంధనతో సమ్మతి పత్రాల పేరిట బిల్లులు ఆపవద్దని ఆదేశించారు. జీవనోపాధి కోసం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించడం తగదని, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు స్పష్టంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బేస్, రూఫ్, స్లాబ్ లెవల్ వరకు ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇల్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలిపోయిన 199 మంది పేర్లను త్వరగా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. రెండో విడతకు సంబందించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాల సేకరణ, మంజూరు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, మేయర్ మూడ్ గణేష్, హోసింగ్ ఇంచార్జి పిడి సవే రామ్, డీఈ ఖలీల్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపిడివోలు సుభాషిణి, సుస్మిత, భారతి, ఏఈలు రమేష్ బాబు, డేవిడ్, నసీరుద్దీన్, పుష్ప, లాల్ సాహెబ్, హసిత, బాధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :