తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్థిక అహింస, శాంతియుత ఆర్థికాభివృద్ధి సేవల కోసం గుర్తింపు ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ (నేషనల్ కౌన్సిల్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన విఠల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ డా. సౌరవ్ అగర్వాల్ 24 ఆగస్టు 2026న నియామక పత్రాన్ని జారీ చేశారు. ఎకానమిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక బహుముఖ, లాభాపేక్షలేని, , స్వతంత్ర సంస్థ అని విఠల్ పేర్కొన్నారు ఆర్థిక సోదరభావం ఆర్థిక అహింసను ప్రోత్సహించేందుకు పనిచేస్తుందని, దానికి కట్టుబడి పని చేయాలని విఠల్ పేర్కొన్నారు. ఆర్థిక, ప్రజా విధానాలు, వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ, విధాన చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ప్రభుత్వ సంబంధాలు తదితర రంగాల్లో నిపుణుల బృందంతో సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. విటల్ నీ గౌరవ ప్రాతిపదికన ప్రారంభంగా ఒక సంవత్సరం కాలానికి, తక్షణ ప్రభావంతో లేదా తదుపరి నిర్ణయం తీసుకునే వరకు నేషనల్ కోఆర్డినేటర్గా ఆహ్వానిస్తున్నట్లు ఎకానమిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా శాంతియుత ఆర్థికాభివృద్ధి, సహజీవనం, సహనం, ఆర్థిక అహింస వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో విటల్ మార్గదర్శకత్వం, సూచనలు, సహకారం అందిస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, బహుళపాక్షిక సంస్థలు, వివిధ సంస్థలు, పౌర సమాజ సంస్థలు, వ్యక్తులతో ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున సమన్వయం చేస్తూ సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలని డాక్టర్ సౌరవ్ శర్మ పేర్కొన్నారు.ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరును దుర్వినియోగం చేయకుండా, తప్పుడు ప్రాతినిధ్యం వహించకుండా, ఎలాంటి ఆర్థిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో సంస్థను భాగస్వామ్యం చేయకుండా న్యాయబద్ధమైన ప్రవర్తనను పాటిస్తానని విటల్ పేర్కొన్నారు.విటల్ నియామకంపై పలు ప్రజా సంఘాలు, ఆర్థిక నిపుణులు పలువురు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్, సామాజిక సంస్థలతో సమన్వయం చేస్తూ ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్ష్యాల సాధనలో ఆయన కీలక పాత్ర పోషించాలని వారు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ