తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 3 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం నందు సీనియర్ జర్నలిస్టుల కమిటీ ఏర్పడిన తరువాత మర్యాదపూర్వకంగా వైరా ఎమ్మెల్యే ను కలసి జర్నలిస్టుల సమస్యలను లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పందిస్తూ మొదటిగా నూతన ప్రెస్ క్లబ్ (సీనియర్స్) కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి మధ్య వారధిగా నిర్విరామంగా పనిచేసేది జర్నలిస్టులు అని అటువంటి మీ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్స్) అధ్యక్షుడు షేక్ జానీ, ఉపాధ్యక్షడు తంబర్ల పుల్లారావు, కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి కాల్లూరి ప్రవీణ్ కుమార్, కోశాధికారి ఎస్కే బుడెన్ పాషా, సహాయ కార్యదర్శి ఉడికల రమేష్, గౌరవ అధ్యక్షుడు సబ్బతి శివమూర్తి, గౌరవ సలహాదారులు కొలిపాక చంద్రశేఖర్, కాశీ మల్ల సురేష్, గోగుల వెంకటేశ్వర్లు, అన్నవరపు జస్వంత్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ