Saturday, 18 April 2026 10:44:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు.

Date : 18 April 2026 08:33 PM Views : 25

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య పీజీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయంగా, రాష్ట్రంలో తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులు ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, కింగ్ కోటి, పటాన్‌చెరు ఆసుపత్రులతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంతో కీలకమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రి కూడా ఎంపిక కావడం విశేషం.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాలలో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, ఈరోజు డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయానికి పిలిపించి, సంబంధిత ఆసుపత్రికి అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశారు . నేడు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చర్యలు పూర్తిచేయబడగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తూ, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు విశేష కృషి చేస్తున్నదని,ఇది భద్రాచలం పరిసర గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు మరియు వైద్య విద్యలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తుంది అని స్పెషలిస్ట్ వైద్యులు , అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు, నూతన సేవల లభ్యత పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి అని డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు తెలిపారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :