తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య పీజీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయంగా, రాష్ట్రంలో తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులు ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, కింగ్ కోటి, పటాన్చెరు ఆసుపత్రులతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంతో కీలకమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రి కూడా ఎంపిక కావడం విశేషం.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాలలో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, ఈరోజు డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయానికి పిలిపించి, సంబంధిత ఆసుపత్రికి అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశారు . నేడు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) రిజిస్ట్రేషన్కు సంబంధించిన చర్యలు పూర్తిచేయబడగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తూ, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు విశేష కృషి చేస్తున్నదని,ఇది భద్రాచలం పరిసర గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు మరియు వైద్య విద్యలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తుంది అని స్పెషలిస్ట్ వైద్యులు , అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు, నూతన సేవల లభ్యత పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి అని డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు తెలిపారు .
Admin
తెలుగు వెలుగు టీవీ