తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంక్రాంతి పండుగ సెలవులు ముగియడం తో మరియు ఆదివారం కూడా కావడం వలన వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన మరియు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో విద్య మరియు ఉద్యోగం నిమిత్తం వెళ్లే ప్రయానికుల తో బస్టాండ్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
ఈ సమయం లో స్పెషల్ ఫేర్ బస్సు అని కొత్తగూడెం నుండి హైదరాబాద్ బయలు దేరిన ఉదయం 11.30బస్సు అదనపు ఛార్జి తల్లాడ కి 30రూపాయలు వైరా కి 40రూపాయలు ఖమ్మం కి 50 మరియు హైదరాబాద్ కి 150 చొప్పున టికెట్ ధరలు అదనంగా వసూలు చెయ్యడం వలన బస్సు లోని ప్రయాణికులు కండక్టర్ తో వాగ్వివాదానికి దిగడం తో... మీరు డిపో మేనేజర్ గారితో మాట్లాడుకోండి అని చెప్పగా.. ప్రయాణికులు కాంగ్రెస్ ప్రభుత్వం విధానం పైన అసహనం వ్యక్తం చేసారు.TS28Z0016 ఎక్సప్రెస్
Admin
తెలుగు వెలుగు టీవీ