తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 26న జరుగుతున్న కలెక్టరేట్ ఎదుట ధర్నా ను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలో రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను, కార్మికుల హక్కులను హరించే విధంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోని నష్టపోతున్నారని ఆరోపించారు.రైతులు పండిస్తున్న అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులు మేరకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నామోడీ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించిందని, రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చేముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఝటిస్తూ నవంబర్ 26 న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ కే యం , కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, దేశ వ్యాప్త ఆందోళనలో రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వామ్యం కావాలని కోరారు . ఈ మావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మ, సిఐటియు జిల్లా నాయకులు యీసా నరేష్, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు వల్లోజి రమేష్, టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎదలాపురం గోపాలరావు,తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి గడిదేశి కనకరత్నం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా, నాయకులు ఎల్లంకి మధు, వల్లమల సామెల్, కల్తి నరసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ