తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు జన్మదినం సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటీయూసీ నాయకులు జీఎంతో కేక్ కట్ చేయించి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియా అభివృద్ధి, గనుల ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల మెరుగుదలకు జీఎం షాలెంరాజు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూల దృక్పథంతో వ్యవహరించి, సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్మికులు, అధికారులు పరస్పర సహకారంతో పనిచేస్తే కొత్తగూడెం ఏరియా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.అనంతరం జీఎంకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, ఆయన నాయకత్వంలో కొత్తగూడెం ఏరియా మరిన్ని విజయాలు సాధించాలని ఎఐటీయూసీ నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ సందబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు సౌజన్య, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ