తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 17, 18న గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా లో 39 పరిక్షా కేంద్రాలలో 13848 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కనున్నారు.ఈ పరీక్షలు రెండు సెషన్ లలో ఉంటాయని 17న పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు, 18న పేపర్ -3 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్ సైట్ https://WWW.TSPSC.GOV.IN నుంచి హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని కలెక్టర్ సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే అభ్యర్థులు TGPSC టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ : 040-23542185 లేదా 040-2354 2187 సంప్రదించాలని, లేదా HELPDESK@TSPSC.GOV.IN కు ఇమెయిల్ చేయవచ్చు అని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ