Friday, 18 September 2026 08:07:36 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 15 June 2026 05:29 PM Views : 178

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్ఓ పద్మావతితో కలిసి ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, రెవెన్యూ మరియు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సమస్యలను కేవలం నమోదు చేయడం కాకుండా, వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అన్నారు . ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం లక్ష్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజావాణిలో అందిన కొన్ని వినతులు: టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన భూక్య సుమన్ తాను జన్మతః దివ్యాంగుడినని, అద్దె ఇంటిలో నివసిస్తూ జీవనం సాగించడం కష్టతరంగా మారిందని, ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన బట్ట కృష్ణవేణి తన కుమార్తె దివ్యశ్రీ ఆరో తరగతి ప్రవేశం కోసం గురుకుల ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ సీటు రాలేదని, తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేదని పేర్కొంటూ గురుకుల పాఠశాలలో సీటు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. దీనిపై తగు చర్యల కోసం ఆర్‌సీఓ, సోషల్ వెల్ఫేర్‌కు ఎండార్స్ చేశారు. సుజాతనగర్ మండలం చిమ్న తండా గ్రామానికి చెందిన భూక్య సేవ తన తండ్రి 2010లో మరణించారని, మరణ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు మీ సేవలో దరఖాస్తు చేసినప్పటికీ తిరస్కరణకు గురవుతోందని తెలిపారు. ఈ కారణంగా తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరుపై మార్చుకోలేకపోతున్నానని, సమస్య పరిష్కరించి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం సుజాతనగర్ తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన స్వప్న తనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, పూర్తిగా వర్షాధార సాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నానని, బోరు మరియు విద్యుత్ సదుపాయం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తదుపరి చర్యల కోసం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామ పరిధిలోని బాలాజీ తండాకు చెందిన భానోత్ అనూష తనకు సంబంధించిన రెండు వేర్వేరు భూముల భూభారతి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తగు చర్యల కోసం సంబంధిత ధరణి అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :