తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండ్రుగొండ మండలం బెoడలపాడు గ్రామం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కీ విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావడంతో ఆనందత్సవ సంబురాలు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామస్తుల చిరకాల వాంఛను నెరవేర్చినందుకు కృతజ్ఞతా భావంగా అనంతారం గ్రామంలో 200 మంది స్వచ్ఛందంగా గ్రామస్తులంతా ముఖ్యమంత్రి సభకు వెళ్లి సభ విజయవంతం కావడంతో గ్రామంలోని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉసికల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కోర్స రమేష్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రభుత్వ లబ్ధిదారులకు సభ విజయోత్సవంలో భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ