Friday, 18 September 2026 02:28:08 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

నాయకపోడు నిరుద్యోగ యువతకు గురు–శిష్య హస్తశిల్ప శిక్షణ కార్యక్రమం : జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్.

Date : 01 February 2026 05:22 PM Views : 223

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో ఏర్పాటు చేసిన నాయకపోడు మాస్క్‌ల తయారీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్‌లో తయారవుతున్న నాయకపోడు మాస్క్‌ల తయారీ ప్రక్రియను పరిశీలించి, కళాకారులతో పరస్పరంగా మాట్లాడి వారి అనుభవాలు, సమస్యలు, అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదారం గ్రామంలో తయారవుతున్న నాయకపోడు మాస్క్‌లు నాయకపోడు సంస్కృతి, సంప్రదాయ కళలకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చాయని తెలిపారు. ఈ సంప్రదాయ హస్తకళను పరిరక్షిస్తూ మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాటు, మండలంలో ఉన్న నాయకపోడు నిరుద్యోగ యువతీ–యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో “గురు–శిష్య హస్తశిల్ప శిక్షణ కార్యక్రమం”ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఈ శిక్షణ కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమవుతుందని, తొలి దశలో 30 మంది నాయకపోడు నిరుద్యోగ యువతీ–యువకులతో రెండు నెలలపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణకు హాజరయ్యే ప్రతి శిక్షణార్థికి రోజుకు రూ.300/- చొప్పున స్కాలర్‌షిప్ అందజేయబడుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో సంప్రదాయ నాయకపోడు మాస్క్ తయారీతో పాటు నాణ్యత మెరుగుదల, ఆధునిక డిజైన్‌లు, మార్కెటింగ్ అంశాలపై కూడా ప్రాయోగిక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం శిక్షణార్థులు స్వయం ఉపాధి, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంప్రదాయ హస్తకళలకు మార్కెట్ అవకాశాలు పెంచడంతో పాటు స్థానిక యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్‌డీఏ నుంచి ఏపీఎం ఆర్. ఉపేందర్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ అంజన్ కుమార్ శిక్షణను అందిస్తారని, గురు–శిష్య విధానంలో ప్రాయోగికంగా నైపుణ్యాలు నేర్పిస్తారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ అంజన్ కుమార్, డీఆర్‌డీఏ ఏపీఎం రామ్ కుమార్, సీసీ ఉపేందర్, మాస్క్ తయారీ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :