తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టి.యు.ఎఫ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యమకారుల చైతన్య యాత్ర ఆదివారం రాత్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పోస్టాఫీసు సెంటర్ నందు టి.యు.ఎఫ్. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యండి.మంజూర్ ఆధ్వర్యంలో యాత్రా బృందానికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చైతన్య యాత్ర బృందానికి పూలదండలు, శాలువాలతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి.యు.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ డా" చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి త్యాగాలు చేసింది ఉద్యమకారులు ఐతే భోగాలు ఉద్యమం ద్రోహులు అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యమకారులకు 250 చ"గ ల స్థలంతో పాటు నిర్మాణానికి 5 లక్షలు, మరియు 25000/- పెన్షన్ ఇస్తామని ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టోలో ప్రకటించి 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం దాని ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని లేకుంటే మరోఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఉద్యమకారులను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు ప్రాదాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 21 తేదీన హైదరాబాద్ సితాఫల్ మండీలో ప్లీనరీకి ఉద్యమకారులు వేల సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి,TUF యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ యండి.మసూద్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సింధూ తపస్వి, తెలంగాణ SC.ST.BC.మైనారిటి విద్యార్థి,యువజన విభాగం అధ్యక్షుడు కోటా శివశంకర్, 69 ఉద్యమకారుల సంఘం నాయకులు మ్యాథ్యూస్,హరగోపాల్,యాదగిరి,యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నవతన్, కొండ జంపన్న,జాన్ విక్టోరియా, జిల్లా కార్యదర్శి ఇజ్జగాని రవి గౌడ్, అడ్వకేట్ సాదిక్ పాషా,అఖిల్ మహర్షి,ఆదిల్,హసీబ్,మౌలాన,మోహన్ రావు, నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ