తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సోప్పరి క్రాంతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ నేషనల్ కమిటీ మెంబర్ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ దత్త సాయి అనాధ మరియు వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారికి,కొత్తగూడెం బస్టాండ్,రైల్వే స్టేషన్ మరియు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అనాధలకు అన్న ప్రసాదాలు వితరణ అందించిన యువ నాయకుడు సోప్పరి క్రాంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని ముఖ్యంగా బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ఉంటూ తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న నాయకుడని ఈ సందర్భంగా అన్నారు... ఈ కార్యక్రమంలో రంజిత్ ప్రజాపతి, గొడుగు శ్రీధర్ యాదవ్, మల్లం అంజయ్య, మాచర్ల మహేష్, కృష్ణారెడ్డి, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ