తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐక్యతతోనే ప్రగతిపథం సాధ్యం యువత సన్మార్గంలో పయనించాలి అన్నదానం మహోన్నతమైన సేవ : సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా పండుగలు, ఉత్సవాలు సమాజంలో మత సామరస్యానికి, సోదరభావానికి నిదర్శనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ దుర్జన్ బస్తీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజాకార్యక్రమాన్ని తిలకించారు, అనంతరం అన్నదానాన్ని ప్రారంభించి బస్తీ ప్రజలకు, భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతాయన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవించినప్పుడే సమాజం శాంతియుతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, సన్మార్గంలో పయనించి ఆదర్శ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆకలిని తీర్చే అన్నదానం ఎంతో మహోన్నతమైన సేవా కార్యక్రమమని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, వుత్సవకమిటి సభ్యులు సికిందర్ సింగ్, పుణ్ణం సింగ్, గోవింద్ సింగ్, రథం కొర్, నంగి కౌర్, బహద్దూర్ సింగ్, బీమా సింగ్, పవన్ సింగ్, బల్వం సింగ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ