తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : RLC తో జరిగిన చర్చల్లో మైనింగ్ స్టాప్ లోకి అధిక ప్రాధాన్యత ఇచ్చి హక్కులు సాధించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కి పివికే5 ఇంక్లైన్ మైనింగ్ స్టాప్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ మైనింగ్ స్టాప్ కు ఓవర్మెన్ ప్రమోషన్, మైనింగ్ స్టాప్ లో MS గా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఊర్మిళ ప్రమోషన్లు కల్పించేందుకు యజమాన్యం అంగీకరించడం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాట కృషివల్లేనని తెలియజేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ మైనింగ్ స్టాప్ లో మెడికల్ ఇన్వాల్యుయేషన్ అయిన వారికి వారి అర్హతలను పరిశీలించి వారి అర్హతలకు అనుగుణంగా సూటబుల్ జాబ్ కల్పించే విధంగాc చర్యలు తీసుకోవడం ఏఐటియుసి కృషి ఫలితమేనని, 2016-2017 JMET బ్యాచ్ కు బ్యాక్ డేట్లతో ప్రమోషన్ ఇవ్వడం అనేది చరిత్ర లో తొలిసారి అని మైనింగ్ స్టాప్ సమస్యలను సమ్మె నోటీసులు చేర్చి మైనింగ్ స్టాప్ తరఫున నిలబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కి మైనింగ్ స్టాప్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని గతంలో కూడా 54 మందికి సర్వీస్ లాస్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా తరఫున నిలబడి మాకు న్యాయం చేసిన చరిత్ర సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉంది అని మా హక్కుల కోసం మేం పోరాటం చేస్తున్న సమయంలో గాని మీ నిరాహార దీక్ష చేసిన సమయంలో గాని ఏఐటియుసి అండగా నిలబడింది అనే విషయాన్ని వారు గుర్తు చేసుకుని భవిష్యత్తులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కి అండగా నిలబడతామని తెలియజేశారు, ఈ సందర్భంగా గతంలో మైనింగ్ స్టాప్ తరఫున నల్ల బ్యాడ్జీలతో నిరసన గని మేనేజర్ కి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కి మైనింగ్ షాప్ తరఫున వినతి పత్రాలు ఇచ్చి పోరాటంలో ముందు నిలిచిన AITUC హెడ్ ఓవర్మెన్ అనిల్ గారిని శలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ సాయి పవన్, ఎద్దు అనిల్, చందులాల్, మురళీకృష్ణ, ధీరజ్, గోవర్ధన్, గడప రాజయ్య AITUC పీవీకే 5ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ భూక్య రమేష్ సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్ సొసైటీ సభ్యులు ఈర్ప కృష్ణ, వెంకట్ సురేందర్ రెడ్డి రామచందర్, నాగేంద్ర హరికృష్ణ శ్రీనివాస్ రెడ్డి రామారావు కృష్ణ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ