Saturday, 18 April 2026 05:07:17 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

విద్య జీవితాన్ని మార్చే ఆయుధం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 01 February 2026 05:05 PM Views : 96

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య జీవితాన్ని మార్చే ఆయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.ఆదివారం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులను కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య అనేది జీవితాన్ని మార్చే ప్రధాన ఆయుధమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు మాత్రమే జీవిత విజయానికి కొలమానం కాదని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో స్థిరపడినప్పుడే నిజమైన విజయాన్ని పొందినట్టు అవుతుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వము ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డెన్ల సూచనలను పాటిస్తూ నిరంతర కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ ప్రేరణ, శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, మెరుగైన విద్యా ఫలితాలు సాధించేందుకు దోహదపడుతాయని కలెక్టర్ తెలిపారు.అనంతరం సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన బోధన అంశాలపై శిక్షణ అందించారు. ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నల రూపకల్పన, సమయ నిర్వహణ, పరీక్షలలో మార్కులు ఎలా సాధించాలి అనే అంశాలపై వివరంగా బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించే విధంగా మార్గదర్శనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. శ్రీలత, సహాయ సంక్షేమ అధికారులు కొప్పుల హనుమంతరావు, సిహెచ్. అక్షయ్, జిల్లాలోని వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆర్.వి.ఆర్. ప్రసాద్, నరసింహారావు, సాయి చరణ్, నాగలక్ష్మి మరియు బోధన సిబ్బంది తారాచంద్, మోహన్ రావు, దస్తగిరి, బి.వి.ఎల్. కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :