Saturday, 19 September 2026 05:53:20 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

విద్య జీవితాన్ని మార్చే ఆయుధం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 01 February 2026 05:05 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య జీవితాన్ని మార్చే ఆయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.ఆదివారం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులను కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య అనేది జీవితాన్ని మార్చే ప్రధాన ఆయుధమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు మాత్రమే జీవిత విజయానికి కొలమానం కాదని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో స్థిరపడినప్పుడే నిజమైన విజయాన్ని పొందినట్టు అవుతుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వము ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డెన్ల సూచనలను పాటిస్తూ నిరంతర కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ ప్రేరణ, శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, మెరుగైన విద్యా ఫలితాలు సాధించేందుకు దోహదపడుతాయని కలెక్టర్ తెలిపారు.అనంతరం సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన బోధన అంశాలపై శిక్షణ అందించారు. ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నల రూపకల్పన, సమయ నిర్వహణ, పరీక్షలలో మార్కులు ఎలా సాధించాలి అనే అంశాలపై వివరంగా బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించే విధంగా మార్గదర్శనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. శ్రీలత, సహాయ సంక్షేమ అధికారులు కొప్పుల హనుమంతరావు, సిహెచ్. అక్షయ్, జిల్లాలోని వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆర్.వి.ఆర్. ప్రసాద్, నరసింహారావు, సాయి చరణ్, నాగలక్ష్మి మరియు బోధన సిబ్బంది తారాచంద్, మోహన్ రావు, దస్తగిరి, బి.వి.ఎల్. కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :