Saturday, 18 April 2026 03:42:33 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత: కాపు సీతాలక్ష్మి

Date : 14 April 2026 03:53 PM Views : 71

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వల్లే నేడు అన్ని రంగాల్లో సమానత్వాన్ని పొందుతున్నాం కొత్తగూడెం టౌన్ రామవరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అలాగే సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టించి కృషిచేసి బలమైన రాజ్యాంగాన్ని నిర్మించారని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగం వల్లే అన్ని రంగాల్లో నేడు మహిళలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముందంజలో ఉన్నారని అన్నారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు రామవరం పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు ఆ ప్రదేశం బహిరంగ మూత్ర విసర్జనకు కేంద్రంగా ఉంటూ దుర్గంధం వెదజల్లేదని గుర్తు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామవరం నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :