Saturday, 18 April 2026 05:01:30 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 March 2026 04:14 PM Views : 137

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి లో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: * కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ వహాబ్, అశ్వరావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 911/33లో 5.00 గుంటల రిజిస్టర్ భూమి తన పేరున ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఆర్ (RSR) సమస్య కారణంగా పట్టాదారు పాస్‌పుస్తకం అందలేదని తెలిపారు. తన పేరున పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం భూభారతి విభాగానికి ఎండార్స్ చేశారు. * టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఆంగోతు సంతులాల్, సర్వే నంబర్ 239/282లో వ్యవసాయ భూమి ఉన్నదని, గతంలో ఇంద్రజల ప్రభ పథకం కింద బోరు మరియు విద్యుత్ మంజూరు అయినప్పటికీ, మోటార్ మీటర్‌కు సర్వీస్ నంబర్ ఇవ్వలేదని తెలిపారు. తన విద్యుత్ కనెక్షన్ కొనసాగించేలా సర్వీస్ నంబర్ మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి విద్యుత్ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. * అల్లపల్లి మండలం చెలగట్టు గ్రామానికి చెందిన కొమరం సారమ్మ, తన భర్త మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, పీజీ (ఎంఏ) వరకు చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కు ఎండార్స్ చేశారు. * కొత్తగూడెం మేదరబస్తీ 53వ డివిజన్‌కు చెందిన శ్రీనివాస్, గత ఎనిమిదేళ్లుగా తమ ఇంటికి కిన్నెరసాని మంచినీటి సరఫరా నిలిచిపోయినప్పటికీ నీటి బిల్లులు విధిస్తున్నారని తెలిపారు. నీటి బిల్లులను రద్దు చేసి కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎండార్స్ చేశారు. * పినపాక, ఏడుళ్ల బయ్యారం, జానంపేట మరియు టి. కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు, రంజాన్ మరియు బక్రీద్ పర్వదినాలలో సామూహిక నమాజ్ నిర్వహించేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈద్గా స్థలం కేటాయించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి పినపాక తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :