తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ కార్యక్రమం ఈరోజు అనగా 17 సెప్టెంబర్ నుంచి 2అక్టోబర్ వరకు ప్రతిరోజు స్వచ్ఛత పైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. “స్వచ్చత హి సేవ” కార్యక్రమాలను ఈ సంవత్సరం స్వఛ్హోత్సవ్ “పేరున ఈ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. స్వచ్ఛతా హి సేవ – 2025 లొ భాగంగా ప్రతి గ్రామములో చేపట్టవలసిన కార్యక్రమాలు:1. స్వచ్ఛత లక్ష్య యూనిట్ల (CTUs అనగా గ్రామములో పెద్ద మొత్తంలో పేరుక పోయిన వ్యర్థాల స్థలాలు గుర్తించి వాటిని ప్రజలందరి సహకారంతో శుభ్రం చేయించి అందంగా, ఉపయోగకరంగా చేయించాలి) 2. ప్రజా స్థలాల్లో పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించాలి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు , హెల్త్ సెంటర్స్, పర్యటక ప్రదేశాలు, ప్రార్థన మరియు ఇతర ప్రజా స్థలాలు) 3. సఫాయిమిత్ర సురక్ష శిబిరాలు. స్వచ్చ శ్రామికుల ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. PPE కిట్స్ , ఇతర రక్షణ సామగ్రి పంపిణీ చేయాలి. ప్రభుత్వ పథకాల లింకేజ్ అందజేయాలి (ఉదా: PMAY, Saubhagya, PM-JAY).4. స్వచ్ఛ హరిత పండుగలు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ద్వార పర్యావరణ హితమైన వేడుకల నిర్వహణ.నదీ తీర శుభ్రత కార్యక్రమాలు. స్వచ్ఛతా కీ రంగోలి రూపొందించాలి. స్వచ్చ బతుకమ్మ ఉత్సవాలు . స్టీల్ బ్యాంకు మరియు ఇతర ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన. స్వచ్చ శ్రామికుల సన్మానం. 5. స్వచ్ఛత పై అవగాహన కార్యక్రమాలు: ODF Plus మోడల్ & స్వచ్ఛ సుజల గ్రామంగా గ్రామా సభల ఆమోదం. గృహాలకు వెళ్లి స్వచ్ఛత పై అవగాహన . స్వచ్ఛత ర్యాలీలు, సైకిల్ యాత్ర . స్వచ్ఛత ప్రమాణము విద్యార్దులకు చిత్ర లేఖనం, వ్యాస రచన, నాటక, ఇతర పోటీల నిర్వహణ.‘ఒక రోజు, ఒక గంట, ఒకటి గా శ్రమదానం’ – 25 సెప్టెంబర్ 2025.సమయం ఉదయం 8.00 గంటలకు. దేశవ్యాప్త శ్రమదానం కార్యక్రమం అన్ని గ్రామాలలో నిర్వహించాలి. 2 అక్టోబర్ న స్వచ్ఛ భారత్ దినోత్సవం, గ్రామ సభ నిర్వహించాలి. “స్వచ్చ హి సేవ” లో రూపొందించిన ఈ కార్యక్రమాలను అన్ని గ్రామ పంచాయతీల యందు గ్రామ పంచాయతీ సిబ్బంది, యువత , SHG మహిళలు మరియు విద్యార్ధుల భాగస్వామ్యం తో ది:17.09.2025 నుండి ది:02.10.2025 వరకు నిర్వహించిన కార్యక్రమాల రోజు వారి నివేదికలు మరియు ఫోటోలు ప్రతిరోజు సా 5.00 లోగా ఆన్లైన్ పోర్టల్ లొ నమోదు చెయ్యవలసినదిగా అదేశించనైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ