తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం మే 03 (తెలుగు వెలుగు) : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు. అందులో భాగంగా ముందుగా మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లిన ఆయనకు వనమా పుష్పాగుచ్ఛం ఇచ్చి, శాలువ తో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి పాల్వంచ రూరల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం కుమారుడు సాయి చరణ్ వివాహం సాయి రుచిత తో ఇటీవల జరగగా పాండురంగాపురం గ్రామంలోని వారి నివాసానికి వనమా వెంకటేశ్వరరావు తో కలసి వెళ్లి నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పాల్వంచ పట్టణం, ఇందిరా నగర్ కాలనీ వాస్తవ్యులు మాలంపాటి గోవిందరావు మాతృమూర్తి పాపమ్మ ఇటీవల మరణించారు కాగా శనివారం నాడు జరిగిన పాపమ్మ దశదిన కర్మకు బిఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరరావు తో కలసి హాజరై పాపమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు.పాపమ్మ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజు గౌడ్, మల్లెల శ్రీరామ్ మూర్తి, కొట్టే వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్ కుమార్, మార్గం గురవయ్య, కాంపల్లి కనకేష్, చందు నాయక్, వీరు నాయక్, సింధు తపస్వి, బట్టు మంజుల, జూపల్లి దుర్గాప్రసాద్, ముత్యాల ప్రవీణ్, శేఖర్, రమేష్, రమణ, తెలంగాణ సురేష్, భూక్యా వీరు నాయక్, ఆనంద్, రామకృష్ణ, ఇక్బాల్, మున్నీర్, రజాక్, సురేష్, లోహిత్ సాయి, అఖిల్ మహర్షి, మురళి శేఖర్, పాల్వంచ రాజేష్, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ