తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సమర్పించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల మెడికల్ కార్డ్ రెన్యువల్ చెయ్యాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పెన్షన్ రెన్యువల్ కొరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 4.0 కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యంతో కలసి చేపట్టిన కార్యక్రమాన్ని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్వాగతిస్తుందని తెలిపారు, కాని సింగరేణి విశ్రాంతి ఉద్యోగులు ప్రతి సంవత్సరం పెన్షన్ కొరకు లైఫ్ సర్టిఫికెట్ తో పాటు సింగరేణి యాజమాన్యం జారీ చేసిన కంట్రిబ్యూటరీ పోస్ట్ ర్కిటెర్ మెడికేర్ స్కీం(సిపిఆర్ఏంఎస్) మెడికల్ కార్డు రెన్యువల్ కొరకు రిటైర్డ్ ఉద్యోగితో పాటు భాగస్వామి కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవసరముందని,పెన్షన్ కొరకు కోల్ మైన్స్ ప్రావిడెంట్ వారికి, సిపిఆర్ఏంఎస్ కార్డు రెన్యువల్ కొరకు సింగరేణికి సమర్పించాలని, సిఎంపీఎఫ్ వారు నిర్వహించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 4.0 కార్యక్రమంలో సిపిఆర్ఎంఎస్ కార్డు రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ వారు నిర్వహించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 4.0 స్పెషల్ డ్రైవ్ శిబిరాల్లో కొంతమంది విద్యావంతులైన సింగరేణి ఉద్యోగులను నియమించి రిటైర్డ్ ఉద్యోగుల సిపిఎర్ఎస్ కార్డు రెన్యువల్ చేయడం వలన విశ్రాంతి ఉద్యోగులకు శ్రమ తగ్గడానికి దోహద పడుతుందని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల తరుపున యాజమాన్యాన్ని మెమోరాండం ద్వారా కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ