Wednesday, 16 September 2026 09:52:57 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు. నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 09 September 2026 06:05 PM Views : 75

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణపతి ఉత్సవాల భద్రతకు పకడ్బందీ కార్యాచరణ.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు.నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచి, నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ప్రాధాన్యతనిస్తూ నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యం చేయరాదని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి నిబంధనలు, భద్రతా సూచనలను వివరించాలని తెలిపారు. శోభాయాత్రల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం రోడ్లపై అందుబాటులో ఉంటూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల ఏర్పాట్లు వాటి పనితీరును సమీక్షించాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, సైబర్ మోసాల్లో నగదు కోల్పోయిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడే వారిపై నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :