తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. కొర్రీలతో, ప్రాముఖ్యత పేరుతో పెన్షన్లు మంజూరు చేస్తే ఉద్యమం తప్పదు.16వ డివిజన్ కార్పొరేటర్ ముని గడప పద్మ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేస్తామంటున్న సామాజిక పెన్షన్లను ఎలాంటి కొర్రీలు, ప్రాధాన్యత క్రమం కాకుండా అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం 16 వ డివిజన్ లో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో ఆగస్టు 15న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తారని వస్తున్న వార్తలు చూసి ప్రజలు సంతోషిస్తున్నారని, వారి సంతోషంపై నీళ్ళు చల్లద్దని, పెన్షన్ల మంజూరు చేస్తామని ఊరిస్తూ ప్రాధాన్యత క్రమం అంటూ అరకొర పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క డివిజన్లో 100 నుండి 150 కి పైగా అన్ని రకాల పెన్షన్ దారులు అర్హులుగా ఉన్నారని ఆమె అన్నారు. కేవలం డివిజన్ కొక 15 నుండి 20 పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటులో మొదటి సంతకమే వికలాంగులకు 6000 ల రూ..,ఇతరులకు 4000 ల రూ..ఇస్తామని నేటి కి పెంచిన పెన్షన్ ఇవ్వకపోవడం లబ్ధిదారులను మోసం చేసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నూతన పెన్షన్ మంజూరు చేస్తారని ప్రజలు ఆశపడ్డారని కానీ వారి ఆశలపై నీళ్లు చెల్లి మల్ల ఆగస్టు 15న అని ప్రకటనలు రావటం ఇది నిజమేనా అని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే ఆగస్టు 15న అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఆమె అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు మునిగడప వెంకటేశ్వర్లు నాయకులు కాంపల్లి దుర్గయ్య, కాంపెల్లి పుష్ప, కాండ్రేగుల సత్యవతి,దొంగ నాగమణి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ