తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 21 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి వనదేవతల సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరలో మొదటి రోజు పూజా కార్యక్రమాలను కమిటీ వారు ఘనంగా నిర్వహించిరు. ఈ పూజా కార్యక్రమాలలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు.వీరితో పాటు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగా కాంతారావు కూడా పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈరోజు నుంచి మూడు రోజులు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకొనుటకు వచ్చు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ