తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు,పోక్సో చట్టం,సోషల్ మీడియా/మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు,పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రాముఖ్యతను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా IDOC నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భరోసా సెంటర్ ఎస్సై అరుణ వివరించారు.అదేవిధంగా భరోసా బృందానికి చెందిన కో-ఆర్డినేటర్ రేణుక,లీగల్ సపోర్ట్ పర్సన్ శిరీష సభ్యులు అంబికా,రమాదేవి,మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, రిసెప్షనిస్ట్ అనూష లు తమ తమ బాధ్యతలు వారు అందిస్తున్న సేవల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య అధికారి డా.ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అనూరాధ,మహిళ,శిశు,వయోవృద్ధుల సంక్షేమ శాఖాధికారులు మరియు సిబ్బంది,సఖి సిబ్బంది,మహిళా సాధికరికత కేంద్రం సిబ్బంది,ఆశా వర్కర్లు,మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు,మొత్తం 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ