Wednesday, 16 September 2026 09:59:23 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రేపు అశ్వరావుపేటలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బయోచార్‌పై ఉచిత శిక్షణ : జిల్లా కలెక్టర్

Date : 06 January 2026 06:04 PM Views : 301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు సువర్ణ అవకాశం. జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే గారి ఆధ్వర్యంలో బయోచార్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించబడనుండగా, మొదటి రోజు HNTC, గరిమెళ్ళపాడు లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమం రేపు (07-01-2026) బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బయోచార్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు, మట్టిసారాన్ని పెంపొందించడంలో బయోచార్ పాత్ర, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పంట దిగుబడులు పెంచడం వంటి అంశాలపై రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణకు సంబంధించిన వివరాలు మరియు లొకేషన్ సమాచారం కోసం క్రింది వారిని సంప్రదించవచ్చని తెలిపారు. శిక్షణ వివరాలకు సంప్రదించవలసిన వారు : రాజు – 92814 79565 (DRDO కార్యాలయం) డా. నాగ అంజలి – 94927 31222 అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేట

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :