Wednesday, 17 June 2026 02:54:21 PM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాల ఉదృతిని కొనసాగిస్తాం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 10 June 2026 05:43 PM Views : 30

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పొట్టకొడుతుందని, ప్రజలపక్షాన ఉద్యమాల ఉదృతిని పెంచి పాలకులకు కళ్ళు తెరిపిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారాలు మోపడం దుర్మార్గమన్నారు. పెంచిన ఇంధన, గ్యాస్ ధరలతో పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర సర్కార్, ధనవంతులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై రాజీలేని పోరాటాలు చేస్తామని, తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రతిఘటన ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె సారయ్య, మున్నా లక్ష్మి కుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి పూర్ణచందర్ రావు, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు రాహుల్, ఎస్ కె ఫహీమ్, మండలాల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: