తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో శనివారం నిర్వహించిన వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఎ. సుచరిత, కె. సాయి శ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ శిబిరంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయార్థులు సహా 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించబడినట్లు వెల్లడించారు.బార్ అసోసియేషన్ ప్రతినిధులు బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, కార్యదర్శి ఎమ్మెస్సార్ రవిచంద్ర, దూదిపాల రవికుమార్, సాదిక్ పాషా, ఎస్. ప్రవీణ్ కుమార్, నల్లమల ప్రతిభ ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్: చైర్మన్ మరియు వైద్యులు దుర్గా ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి కార్యక్రమానికి విశేష సహకారం అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ విధమైన కార్యక్రమాలు ప్రజలకు శ్రేయస్సును చేకూర్చడంలో మరియు న్యాయవాదులు, న్యాయార్థుల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని అధ్యక్షుడు లక్కినేని తెలిపారు. న్యాయశాఖ సిబ్బంది నాయకులు రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్, దీకొండ రవికుమార్, రామకృష్ణ, ప్రమీల, మీనా కుమారి, యాద రమణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ