తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ యాదవ్ కమిటీ సమావేశం గురువారం బాబు క్యాంపులోని జీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా యాదవ పెద్దలు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ యాదవ పెద్దల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నాగ సీతారాములు యాదవ్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. టౌన్ అధ్యక్షుడిగా చిలక రవి యాదవ్, ఉపాధ్యక్షులుగా అమడగని జయప్రకాశ్, బొబ్బల వెంకట్, రేఖ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కసరబోయిన రమేష్, కార్యదర్శిగా బుద్ది మధు యాదవ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా పలువురు యాదవ సంఘం నాయకులు అభినందించారు. యాదవుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్తో పాటు పట్టణ యాదవ పెద్దలు, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ