తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖైరతాబాద్ డిసిసి ఎంపిక లో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింహ గోయల్, టీపీసీసీ అబ్జర్వర్స్ సంగమేశ్వర్, చంద్రశేఖర్,కంటెస్టేడ్ ఎమ్మెల్యే క్యాండెట్ అభ్యర్థి ఉస్మాన్ ఖాన్ లతో కలిసి టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు . ముందుగా నాగాసీతారాములు ముఖ్య నాయకుల తో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగా సీతారాములు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని , కష్టపడ్డ వారికి డిసిసి పదవి వస్తుందని , అందరి అభిప్రాయం ప్రకారమే డిసిసి ఎంపిక ఉంటుందని , అందరి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి అందజేస్తామని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , వివిధ అనుబంధ సంఘ సభ్యులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ