తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 22 తెలుగు వెలుగు ) : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్అ సోసియేషన్ కార్మికుల డిమాండ్ల సాధనకు ఇచ్చిన "సెప్టెంబర్ 22 ఛలో ఎస్.పి.డి. కార్యాలయం" పిలుపును భగ్నం చేసేందుకు చేసిన అక్రమ అరెస్టులను టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కనీస వేతనాలను రూ.26 వేలు చేయాలనీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలనీ, కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత నిబంధన తొలగించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ కల్పించాలనీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలనే తదితర డిమాండ్లపై శాంతియుతంగా జరప తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయపూనుకోవడం శోచనీయమని ఆయన తెలిపారు. అధికారానికి రాక ముందు "ఆక్యుపై ఇందిరా పార్కు' ఆందోళనలో భాగస్వామయమైన కాంగ్రెస్, 7వ డిమాండ్గా ప్రజాస్వామ్యాన్ని హామినిచ్చిన కాంగ్రెస్ అధికారానికి వచ్చాక ఇలా అప్రజాస్వామికంగా కార్మిక గొంతులు నొక్కాలని చూడడం అత్యంత హేయమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు.ఎస్.పి.డి. కార్యాలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతినిచ్చిన పోలీసులు అక్రమ అరెస్టులకు పూనుకోవడం దుర్మార్గకరమన్నారు. తమ సమస్యల గురించి అధికారులకు చెప్పుకొనేందుకు ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట, పెద్దపల్లి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ,మహబూబ్నగర్ జిల్లాల నుండి బయలుదేరిన కేజీబీవీ వర్కర్లను, టీయుసీఐ రాష్ట్ర నాయకులు గంగన్న, జగన్, నరసింహ, కేజీబీవీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరి, లీలమ్మ, తదితరులను అరెస్టు చేశారని,వీరిని వెంటనే విడుదల చేయాలని గోపాలరావు డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించుకునే కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని,ఇటువంటి అప్రజాస్వామ్యక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోపాలరావు డిమాండ్ చేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ