Wednesday, 16 September 2026 04:23:39 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జిల్లాస్థాయి ఆసుపత్రుల ప్రగతి పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 March 2025 06:56 PM Views : 1333

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, స్కానింగ్, రక్త పరీక్షలు, సర్జరీలు డయాలసిస్ మరియు డెలివరీ లపై ఆస్పత్రులు వారీగా ప్రగతిపై ఆసుపత్రుల సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో పారిశుధ్యం కొరకు అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈ ఎన్ టీ వైద్యం కోసం కావలసిన యంత్ర పరికరాలకు సంబంధించి నివేదికలు అందించాలన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో ఆసుపత్రుల్లో ఎక్కడైనా లీకేజీ, త్రాగునీటి సమస్య వంటి వాటిని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు మరియు సిబ్బందిని నియామకానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో అభివృద్ధి కొరకు సింగరేణి, ఐ టి సి, కేటీపీఎస్ యు నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, దానికి తగిన విధంగా సరైన ప్రణాళికలు రూపొందించాలని సూపర్డెంట్ లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.సిబ్బంది హాజరు పై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు . నర్సింగ్ సూపర్డెంట్లు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందికి డ్యూటీలు వేయాలని అన్నారు. ఆసుపత్రులలో సరిపడా మందులు లేవంటే ఆసుపత్రి ఫార్మసిస్టులు దే బాధ్యత అని అన్నారు. అవసరమైన మందులకు ఎప్పటికప్పుడు ఇండెంట్లు పంపించాలని సూచించారు.ఇండెంట్లు పెట్టిన మందులు రాకపోతే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచి డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చర్యలు చేపట్టాలి.ప్రభుత్వ ఆసుపత్రి కివచ్చే పేద రోగుల కు అందించే వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా అన్ని విభాగలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపడెంట్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :