తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా 18 తారీకు పాల్వంచలో మొదలైన ఒలంపిక్ రన్ నిన్న దమ్మపేట చేరుకుని ఈరోజు ఉదయం 6:30 కి భద్రాచలం లో ఒలంపిక్ క్రీడా జ్యోతిని క్రీడాకారులు ఎమ్మెల్యే తెల్లం.వెంకటరావుకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం. వెంకటరావు మాట్లాడుతూ భద్రాచలంలో ఒక 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు స్థలం సేకరించాలని త్వరలో ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ బి రాహుల్ ఐఏఎస్, భద్రాచలం ఏఎస్పి విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ చిఎఫ్ ప్యాట్రన్ నాగా సీతారాములు మాట్లాడుతూ భద్రాచలం పరిసర ప్రాంతంలో గిరిజన క్రీడాకారులు అద్భుతంగా రానిస్తున్నారని వారికి సహకారం ఇవ్వటం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారన్నారు. యువత గంజాయి లాంటి చెడు వ్యసనానికి పోకుండా క్రీడల వైపు మళ్లాలని భద్రాచలంని గంజాయి రహిత పట్టణంగా మార్చాలని యువతని కోరారు. జిల్లా క్రీడాకారులకు మంచి క్రీడా సదుపాయాలు కలగజేస్తే అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని భద్రచలంలో స్టేడియం నిర్మాణం వలన క్రీడాకారులు తోపాటు మార్నింగ్ నడక చేసెవారికి ఎంతో ఉపయోగం గా ఉంటుందని అన్నారు . అనంతరము అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ ఒలంపిక్ డే రన్ సుమారు 200 మంది స్థానిక క్రీడాకారులు చాలా ఉత్సంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమము లో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ కే .మహిధర్ , వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ పి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ