Thursday, 17 September 2026 12:51:14 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం లో 50.4 kg ల గంజాయి పట్టివేత.

Date : 28 January 2026 06:46 PM Views : 321

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఒరిస్సా నుంచి కేరళకు కారు లో గంజాయి తరలింపు.. నిందితుల నుంచి రూ. 17 వేలు స్వాధీనం. ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. 50.4 కేజీల గంజాయి తో పాటు రూపాయలు 17,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ K.తిరుపతి ఆధ్వర్యం లో SI Ch.శ్రీ హరి రావు మరియు సిబ్బంది కలిసి భద్రాచలం to నెల్లిపాక రోడ్డు లో తనిఖీలు తనిఖీలు చేపట్టారు. భద్రాచలం ఇసుక రీచ్ సమీపం లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక FIAT కారు ను ఆపి తనిఖీ చేయగా కారు లో 50.4 kg ల గంజాయి లభ్యమైంది. తదుపరి విచారణ లో ఇట్టి గంజాయి ని తిరువనంతపురం (కేరళ)కి చెందిన A1) అక్షయ్ సురేష్ ,A2) కుంజుమాన్ సురేంద్రన్ మినిమోల్ మరియు A3) అనంత కృష్ణన్ లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి తిరువనంతపురం (కేరళ) కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.. తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని , FIAT కార్ ను , ముగ్గురు ముద్దాయిలను , 4 సెల్ ఫోన్లను మరియు రూ. 17 వేల నగదును సీజ్ చేసి ( వీటి మొత్తం విలువ 28 లక్షల 70 వేల రూపాయలు) భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడమైనది.. ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ యం.ఏ.కరీం, కానిస్టేబుల్స్ సుధీర్,వెంకట్, హనుమంతరావు, వీరబాబు , ఉపేందర్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీం ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ షానవాజ్ ఖాసీం, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ G.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ G.గణేష్ అభినందించారు. ఏదైనా గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని ES తిరుపతి తెలియజేశారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :