Monday, 03 August 2026 05:05:07 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి... ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 19 January 2025 06:54 PM Views : 1018

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని స్థానిక కొత్తగూడెం క్లబ్ లోని ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది స్థానికులు పాల్గొన్నారు.ముందుగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కొత్తగూడెంలో ట్రాఫిక్ సమస్యను,పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో పోలీసు వారు చేపట్టే కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు.అదే విధంగా జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమ,నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమైన ప్రదేశాలలో చేయవల్సిన మార్పుల గురించి,ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నిరంతర పనితీరు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి వివరించారు. అదేవిధంగా జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండి జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.కొత్తగూడెం పట్టణ వ్యాప్తంగా నూతనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని అన్నారు.వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు మరియు పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ వారి సూచనలను పాటించాలని అన్నారు.అన్ని శాఖల వారు సమిష్టిగా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.అనంతరం జాతి రోడ్డు భద్రత మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :