Monday, 03 August 2026 04:58:13 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన గ్రామసభలు ఎమ్మెల్యే రాందాస్ నాయక్.

Date : 02 April 2026 05:44 PM Views : 331

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీ లో జరిగిన గ్రామ సభకు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికై ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రతి పంచాయతీలో గ్రామసభలు నిర్వహిస్తున్న మని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ సభలు కీలక వేదికలుగా మారుతున్నాయని తద్వారా అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందుతాయని అన్నారు. అనంతారం గ్రామపంచాయతీని ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని అనంతారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేశామని, త్వరలో సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించి ఇంద్ర జలప్రభ ద్వారా మోటార్లు విద్యుత్ లైన్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి జూలూరుపాడు తాసిల్దార్ టి శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీవో తులసిరామ్,మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, పీహెచ్సీ వైద్యులు వెంకటేశ్వర్లు, ఎఫ్ ఆర్ వో ప్రసాద్ రావు, పంచాయతీ కార్యదర్శి జి సైలజ, సర్పంచ్ కొరస రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :