తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 11 తెలంగాణ బెటాలియన్ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర పర్యవేక్షణలో టేకులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో 8వ రోజు కార్యక్రమంలో టేకులపల్లి ఎస్సై శ్రీమతి జుబేదా బేగం పాల్గొని ఎన్సిసి క్యాడెట్స్కు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.నేటి డిజిటల్ యుగంలో యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచుకోవడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లలో ప్రైవసీ సెట్టింగ్స్ను సక్రమంగా ఉపయోగించుకోవడం గురించి వివరించారు. తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో స్నేహాలు చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై హెచ్చరిస్తూ, ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ OTP అడగరని, ఎవరికీ OTP లేదా PIN వివరాలు చెప్పకూడదని తెలిపారు. అలాగే KYC అప్డేట్ లేదా బహుమతుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ