తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగినది, జిల్లా నాయకురాలు రత్నకుమారి మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమైన విషయం ఎన్ని చట్టాలు వచ్చినా నేరస్తులను అదుపులో పెట్టలేకపోతున్నారు 8 నెలల పసి గుడ్డు నుండి 10 సంవత్సరాల బాలిక 90 సంవత్సరాల వృద్దురాలిని కూడా వదలని ఈ దుర్మార్గులకు కచ్చితంగా ఉరిశిక్ష పడాలి, గల్ఫ్ దేశాలలోచిన్న తప్పు చేసిన వెంబటే షూట్ చేయడమా లేదా ఉరిశిక్ష వేయడమా అమలు చేస్తారు, అలాంటి చట్టం మనదేశంలో రావాలి,కానీ మనదేశంలో సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి తిరిగి ఎప్పటికో శిక్ష పడుతుంది, లేదా బెయిల్ మీద బయటికి వచ్చేస్తాము అనే ధైర్యముతో ఈ దుర్మార్గుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, వెలుగులోకి వచ్చేయి కొన్ని వెలుగులోకి రానివి కోకొల్లలు, ఎన్ని చట్టాలు తెచ్చినా వీరు మారరు, ఈ దుర్మార్గులు మారాలి అంటే ఉరిశిక్ష మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఉరిశిక్ష అమలులోకి తెస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి,దోషులు ఎంతటి వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా మనదేశంలో గంజాయి, కుకెన్ లాంటి డ్రగ్స్ సేవించడం వలన ఎంతటి అరాచకానికైనా తెగబడుతున్నారు, వాటిని అరికట్టాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము, ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, మద్దెల విజయలక్ష్మి, పల్నాటి వీణ, షమీమ్,శాంతి, సునీత, బుజ్జమ్మ, ప్రమీల,లావణ్య,శ్రీరాముల విజయలక్ష్మి,మానస,పుష్పతదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ