Wednesday, 16 September 2026 10:03:29 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహాసభను జయప్రదం చేయండి మహాలక్ష్మి పథకం తక్షణమే అమలు చేయాలి మునిగడప పద్మ

Date : 02 August 2025 07:03 PM Views : 1099

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళా సమస్యల సాధన కోసం ,మహిళా సాధికారతే లక్ష్యంగా ఉద్యమాల రూపకల్పనకు నేడు (ఆదివారం) జరిగే మహిళా భారత మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు )కొత్తగూడెం 3వ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శనివారం లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ లో జరిగిన మహిళ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో పురుషులతోపాటు సమాన విధులు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందని అలాగే మహిళలపై రోజురోజుకు హింసలు పెరుగుతున్నాయని, వీటి నుండి మహిళల రక్షణ కోసం మహిళలందరూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికల నాడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణి 2500 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని తక్షణమే అమలుపర్చి మహిళల ఆశీర్వాదాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతుల కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, అలాగే పెంచుతానని హామీ ఇచ్చిన పెన్షన్లు తక్షణమే పెంచి అమలుపరచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేడు జరిగే మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు 3వ పట్టణ మహాసభలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పట్టణ మహాసభను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ సిపిఐ శాఖ కార్యదర్శి ముద్ధం మార్తమ్మ, మహిళా కార్యదర్శి తమ్మ దుర్గ, బి పద్మ, రావి చెట్టు పద్మ ,నూరి, తేలగరి మాణిక్యమని, కత్తుల ప్రేమ వాని, భానోత్ సునీత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :