Wednesday, 16 September 2026 05:23:58 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బడుగు, బలహీన వర్గాల గొంతుక సురవరం. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఫహీం.

Date : 22 August 2026 06:35 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బడుగు, బలహీన వర్గాల గొంతుక సురవరం. పార్లమెంటులో ప్రజా గళాన్ని బలంగా వినిపించిన ప్రజా నేత.సురవరం జీవితం కమ్యూనిస్టు కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం.నిరాడంబర జీవనం నేటి తరానికి ఆదర్శం.వామపక్ష ఐక్యతకు నిరంతరం పరితపించిన నేత.ఆయన చూపిన బాటలో ఉద్యమాలను నిర్మిద్దాం. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఫహీం. కమ్యూనిస్టు ఉద్యమాల్లో చెరగని ముద్ర వేసిన సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఫహీం పిలుపునిచ్చారు. సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం శనివారం స్థానిక జిల్లా సీపీఐ కార్యాలయమైన శేషగిరి భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎస్ కే ఫహీం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటాల్లో పాల్గొని అంచెలంచెలుగా జాతీయ నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి సురవరం అని కొనియాడారు. కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం నిస్వార్థంగా పోరాడారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజా సమస్యలను చట్టసభల్లో సమర్థవంతంగా వినిపించి తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల ఐక్యత కోసం సురవరం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఆయన ఆచరించిన నిరాడంబరత, సిద్ధాంత నిబద్ధత నేటి యువతరానికి ఎంతగానో ఆదర్శనీయమని చెప్పారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి ఆయనకు నిజమైన నివాళి అర్పించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, నాయకులు ఎండి యూసుఫ్, గోపి కృష్ణ, ధర్మరాజు, మిర్యాల రాము షహీన్, కైసర్, మేదిని లక్ష్మి, చోటు షరీఫ్, ఆఫ్జల్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :